జనసేన కార్యదర్శి కవల శ్రీరామ్ ను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం: ముక్కినాడ గ్రామానికి చెందిన రాజానగరం మండల జనసేన కార్యదర్శి కవల శ్రీరామ్ చిన్నమ్మ కవల చక్రం కొన్ని రోజుల క్రితం కాలం చేసారు అన్న విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ కవల శ్రీరామ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమం లో రాజానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ నగవరుపు భానుశంకర్, రాజానగరం మండల జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ పుచ్చర్ల సాయి, పల్లా హేమంత్, చల్లా ప్రసాద్, జనసైనికులు, ముక్కినాడ జనశ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.