పార్టీ బలోపేతం దిశగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన అడుగులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు దమ్మపేట మండల జనసేన వార్డు మెంబర్ యార్లగడ్డ శ్రీనివాసరావుతో సమావేశమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం సెక్రటరీ గరికే రాంబాబు, ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాక సభ్యులు గొల్ల వీరభద్రం, ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్, మండల కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు తదితరులు. ఈ సమావేశంలో జనసేన పార్టీ బలోపేతంపై చర్చించడం జరిగింది. జిల్లా నాయకులు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖముఖి నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించి.. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాబోవు సార్వత్రిక ఎన్నికలలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జిల్లాలోని సీనియర్ నాయకులు మరియు పార్టీ అనుబంధ కమిటీలు విద్యార్థి యువజన, వీరమహిళా విభాగం కమిటీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసీ, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలను జనసైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేస్తానని, అలాగే ములకలపల్లి మండలంలో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్నారని ప్రశంసించడం జరిగింది. జనసేన కార్యకర్తలు, నాయకులు ఐక్యమత్యంతో కలిసి పోరాడి పార్టీని గ్రామస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ రామ్ తాలూరి ఆదేశాలు, సూచనల మేరకు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మరింత కృషి చేస్తానని తెలియజేసినారు.