అచ్చమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం : కోరుకొండ మండలం, కణుపూర్ గ్రామానికి చెందిన ముచ్చకర్ల అచ్చమ్మ ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఈ విషయాన్ని జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల అధ్యక్షులు మండపాక శ్రీను, కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ సీనియర్ నాయకులు తెలగంశెట్టి శివ, కోరుకొండ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు, తన్నీరు తతాజీ, కొచ్చర్ల బాబీ, పెమ్మాడ సతీష్, వల్లేపల్లి రాజేష్, చల్లా ప్రసాద్, పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు.