అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన తక్షణ సహాయం

రామచంద్రపురం: ఇటీవల కాలంలో కాజులూరు మండలం మొగలిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఒక తాటాకిల్లు దగ్ధమైనది. వారు బాగా నిరుపేద కుటుంబానికి చెందినవారు వారికి తక్షణ సహాయంగా రామచంద్రపురం పట్టణము తోట వారి వీధి జన సైనికుల తరపున రెండు నెలలకు సరిపడా కిరాణా సామాన్లు, రైసు, కూరగాయలు మరియు వంట పాత్రలు, బట్టలు, దుప్పట్లు, టవల్స్ అందజేయడమైనది. ఈ కార్యక్రమంలో మొగలిపాలెం జనసేన నాయకులు నున్న వెంకటేశ్వరరావు, శ్రీను మరియు రామచంద్రపురం జనసేన నాయకులు అక్కిరెడ్డి శ్రీనివాస్, సుందర చిన్ని, దొడ్డ దుర్గాప్రసాద్, జోగా కృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమాలు అందించిన తోటవారి వీధి జనసేన నాయకులకు జనసేన సైనికులకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.