కనుపూరు గ్రామంలో జనసేన కార్యకర్తల సమావేశం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కనుపూరు గ్రామంలో జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మేడా గురుదత్త ప్రసాద్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని గ్రామాల్లో ఏ విధంగా బలోపేతం చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు ఎలా తెలియపరచాలి అనే దాని గురించి, అలాగే క్రియాశీలక సభ్యత్వం గురించి, దాని వలన కలిగే ప్రయోజనాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కోరుకొండ మండల అధ్యక్షుడు మండపాక శ్రీను, మండల ఉపాధ్యక్షులు, ముక్కా రాంబాబు, కనుపూరు గ్రామ పార్టీ జనసేన నాయకులు, కర్రీ దొరబాబు, మారిశెట్టి త్రిమూర్తులు, వెలిశెట్టి రామచంద్రరావు, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.