రామచంద్రపురం జనసేన కార్యాలయంలో జనసేన నాయకుల సమావేశం

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల జనసేన పార్టీ కన్వీనర్ మరియు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడా గురుదత్త ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పొలసపల్లి సరోజలతో జనసేన పార్టీ రామచంద్రపురం పట్టణ జనసేన నాయకుల కలయిక సమావేశం మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం నందు మండపేటలో జరుగు కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 16 వ తేదీన మండపేటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విచ్చేయుచున్న కార్యక్రమం గురించి చర్చించే నిమిత్తము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.