రైతు భరోసా యాత్ర విజయవంతం కావాలి

కోనసీమ జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర ఈనెల 16న మండపేటలో జరగనుంది. ఈ యాత్ర విజయవంతం కావడానికి వరుణ దేవుడు శాంతించాలని జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్లు, ఎంపిటీసీలు, నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.