ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సమావేశం

మచిలీపట్నంలో మార్చ్ 14 తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభకు ఏర్పాట్లు గురించి సభా వేదిక వద్ద జనసేన నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ మోహనరావు (గాంధి), జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలం నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.