ఆమదాలవలసలో యువశక్తిని విజయవంతం చేయాలని సమావేశం

ఆమదాలవలస, జనవరి 12 వ తేదీన రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే యువశక్తి కార్యక్రమంలో పెద్దఎత్తున యువత, మహిళలు, పెద్దలు అందరూ పాల్గొనాలి అనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బుర్జి మండలం తోటవాడ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధులుగా పాల్గొని యువశక్తి పోస్టర్స్ ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తకోట నాగేంద్ర, స్థానిక జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.