తల సేమియా వ్యాధి బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం

మధిర నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీ రాము తాళ్లూరి, ఆదేశాలు మేరకు సెప్టెంబర్ 2న శనివారం ముదిగొండ మండలంలోని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముదిగొండ మండలం, వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర ముదిగొండ మండల నాయకులు సమక్షంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ తో పాటుగా ముదిగొండ మండల నాయకులు మిట్టపల్లి రామారావు, ముదిగొండ మండల నాయకులు జొన్నలగడ్డ భద్ర, మీడియాతో మాట్లాడుతూ తల సేమియా బాధితులకి ప్రతి 21 రోజుకు ఒకసారి రక్తం అందని యెడల వారి ప్రాణానికి హాని ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మానవసేవే మాధవసేవనే దృక్పథంతో శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుగుణంగా దేశంలోని నలుమూలలా జనసైనికులు, వీరమహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మధిర నియోజకవర్గంలోని ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈ సమాజం గురించి ఆలోచించి ప్రజల పక్షన నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే 2024 లో మధిర గడ్డమీద జనసేన జెండా ఎగరేయటానికి అన్ని గ్రామాల జన సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండో తారీఖున తల సేమియా బాధితుల కోసం రక్తం ఇచ్చి ప్రాణదాతలు కావాలని ఈ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ రక్తదాన శిబిరానికి మీడియా మిత్రులు సహకరించాలని తెలియజేశారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9542896021,9493003638