వర్ధన్ అనాధాశ్రమంలో విష్ణు యాదవ్ పుట్టినరోజు వేడుకలు

జనగామ: నక్కల స్వరూప రాజు కుమారుడు విష్ణు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో సోమవారం అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నక్కల తిరుపతి యాదవ్ జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.