సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పిఠాపురం, సావిత్రిబాయి పూలే సేవా కార్యక్రమాలు అనుసరించి పిఠాపురంలో యు.కొత్తపల్లి మండలం, యండపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తోట ఊరు గ్రామంలో నిరుపేద కుటుంబాలకు జనసేన పార్టీ పి.ఎస్.ఎన్. మూర్తి బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని ప్రజలకు తెలియజేశారు కష్టమొస్తే ఒక్కరోజులోనే మేము మీ వీధిలైట్లు వేయించగలిగాము పార్టీ అధికారంలో వస్తే మీకు ఏ సౌకర్యాలు కావాలో అవి అన్ని ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాం అని తెలియజేశారు. ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈసారి మా ఓటు జనసేన పార్టీకే అని సంతోషంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టైల్స్ బాబి, మల్లం శ్రీనివాసరావు, ముప్పన రత్నం, వినకొండ అమ్మాజీ, జవ్వాది నాగేశ్వరరావు, వానపల్లి రాము, విప్పర్తి దుర్గాప్రసాద్, గంపల నవీన్, పోసపల్లి దుర్గబాబు, విప్పర్తి నాగబాబు, పాలేటి అశోక్, నాయకులు జనసైనికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.