పాఠశాలల విలీనం ఎస్సీ, ఎస్టీ పిల్లలను విధ్యకు దూరం చేయడమే

మర్రిపాడు మండలం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సెంటర్ లోని ప్రాథమిక పాఠశాల 3,4 తరగతి చదువుతున్న పిల్లలను హైస్కూల్ లో విలీనం చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ పిల్లలు విధ్యకు దూరం చేయడమే అని మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా తెలిపారు. ప్రధాన కార్యదర్శి గంటా అంజి మాట్లాడుతూ.. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేందుకు జనసేన పార్టీ విద్యార్థుల తల్లి తండ్రుల తరుపున పోరాడుతామని తెలియజేడం జరిగింది. అనంతరం మండల విద్యాధికారి మాలకొండయ్య కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ప్రమీలా మండల ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్, ప్రధాన కార్యదర్శి గంటా అంజి, మండలనాయకులుచిన్నాజనసేనస్థానికులు కన్నెమరకల వెంకటరమణ, మంచాల పెంచలయ్య విద్యార్థిని విద్యార్థులకు తల్లి తండ్రుల పాల్గొన్నారు.