క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు: పాలకొండ జనసేన

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున, నియోజకవర్గ జనసేన నాయకులు క్రైస్తవ, సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ పాలకొండ కేంద్రంలో ఉన్న శ్రీ లూర్డు మాత దేవాలయం నందు చర్చ్ ఫాదర్ ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జనసేన నాయుకులు మాట్లాడుతూ.. లోకభాంధవుడుగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు. పశువులపాకలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవించి ప్రపంచానికి త్యాగం.. శాంతి.. ప్రేమ సందేశాలను ఆచరణాత్మకంగా అందించిన ఆ ప్రభువు పలుకులు సర్వదా ఆచరణీయం. ‘ఈర్ష్యాద్వేషాలు, కుట్రలు కుతంత్రాలు, ద్రోహ చింతన విడనాడాలి’ అన్న క్రీస్తు వ్యాక్యము శ్రేయోదాయకము. అబద్దం, లంచం, లోభానికి పాల్పడనివారే నిజమైన క్రీస్తు భక్తులు అని చెప్పిన బైబిల్ సారాన్ని విశ్వసిస్తాము. ఈ ఆనందపు వేళ ప్రజలందరికీ అంతులేని ఆనందాన్ని, సంపదను ప్రసాదించాలని ఏసు క్రీస్తును ప్రార్ధిస్తున్నామని తెలియజేసారు. ఈ యొక్క కార్యక్రమంలో మన్మధరావు, రమేష్, ప్రశాంత్, జనసేన జానీ, అనిల్, హరికృష్ణ, సుబ్బు, పుండరికం, సాయిపవన్, గోపాల్, భూషణ్, గోపాల్ పాల్గొన్నారు.