వైసీపీ కుట్రను మైనార్టీలు తిప్పి కొట్టాలి: జనసేన ఖాసీం

పిడుగురాళ్ళ: దాచేపల్లిలో జరిగిన ఘటనలో భాగంగా వైసీపీ కుట్రను మైనార్టీలు అందరూ తిప్పి కొట్టాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా పిలుపునిచ్చారు. శనివారం
విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఊరేగింపు నేపథ్యంలో రెడ్డి, కాపులకు మధ్య జరిగిన గొడవని కాపు, మైనార్టీలకు మధ్య జరిగిన దాడిగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోవు ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించిన నాటి నుండి వైసీపీ కి ఓటమి భయం పట్టుకుందన్నారు. వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. టిడిపి, జనసేన లో ఎక్కువ శాతం మైనార్టీల ఓటర్లు వున్న కారణంగానే ఇలాంటి సంఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. దాచేపల్లి పట్టణంలో హిందువుల పండుగలకి ముస్లింలు, ముస్లిం ల పండుగలకు హిందువులు హాజరై భాయ్ భాయ్ గా మెలుగుతారని, కలిసిమెలిసి భోజనాలు చేస్తారని గుర్తు చేశారు. కేవలం కులాలను రెచ్చ గొట్టి వైసీపీకి అనుకూలంగా మార్చుకోవాలనే ఇలాంటి కుట్ర పన్నారని మండిపడ్డారు. కులాలకు అతీతంగా ఈ ఘటనను ఖండించాలని సూచించారు. పోలీసులు కూడా జరిగిన గొడవలో నిజనిజాలను నిగ్గు తేల్చాలని ఖాసీం కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల మండల ప్రధాన కార్యదర్శి షేక్ మదీనా పాల్గొన్నారు.