మినుము రైతులకు లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలి: సందు పవన్

గుడివాడ నియోజకవర్గం, రూరల్ మండలంలో, మోటూరు గ్రామంలో అకాల వర్షాలకు సుమారు 70 ఎకరాల్లోని మినుము పంట పూర్తిగా నాశనం అయిపోయిందని తెలుసుకుని జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులతో రైతులు మాట్లాడుతూ… ఎకరానికి సుమారుగా లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని. చేతికి వచ్చిన పంట వర్షం కారణంగా పూర్తిగా పాడైపోయిందని. ఇక్కడున్న వారంతా కౌవులు రైతు వ్యవసాయ కుటుంబీకులని. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే ఆత్మహత్యలే మాకు దిక్కని. కనీసం మమ్మల్ని ఏ నాయకుడు పరామర్శించలేదని జనసేన నేతలకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ… రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి లక్ష రూపాయలు అందేంతవరకు న్యాయ పోరాటం చేస్తామని. జనసేన పార్టీ రైతులకు ఎప్పుడు అండగా నిలబడుతుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కార్యదర్శి పేర్ని జగన్, కృష్ణా జిల్లా నాయకులు గంటా చైతన్య మండల పార్టీ నాయకులు శనక్కాయలు, మల్లేశ్వరి, కొప్పర్తి విమల కుమారి మరియు స్థానిక నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.