డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట 2వ రోజు

విశాఖ దక్షిణ నియోజకవర్గం, గురువారం సాయంత్రం 35వ వార్డు పలు ప్రాంతాలలో జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పలు ప్రాంతాలు పవనన్న ప్రజబాట కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మంచిని వివరించారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమో లేదని తెలిపారు. అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నారని పేర్కొన్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆదేశాలతో, సూచనలతో తాము కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చామని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ప్రజలు కూడా జనసేన వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోమలి, మంగ, రఘు, ప్రసాద్, అడపా సత్తిబాబు, గణేష్, నగేష్, నవీన్, తెలుగు అర్జున్, జానకి, ఝాన్సీ, దుర్గ, కుమరి, అలేఖ్య, రాజి, వెంకతి కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.