అద్భుతమైన ఘనత సాధించిన మిథాలీ రాజ్

భారత మహిళ వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అద్భుతమైన ఘనత సాధించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో 36 పరుగులు చేసిన మిథాలీ అంతర్జాతీయ క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్ గా రెండో మహిళా క్రికెటర్ గా రికార్డు నెలకొల్పింది. అయితే ఇప్పటివరకు ఆడిన మొత్తం 10 టెస్టుల్లో 663 పరుగులు, 211 వన్డేలో 6938 పరుగులు అలాగే 89 టీ 20 మ్యాచ్ లలో2364 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇప్పటివరకు 176 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ (11),దీప్తి శర్మ (8) తో బ్యాటింగ్ చేస్తున్నారు.