న్యూజిలాండ్ ప్రధాని జెసిండాకు మోడీ విషెస్

న్యూజిలాండ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండోసారి పదవిని దక్కించుకున్న ఆ దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని అన్నారు. “న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్‌ ఆమె అద్భుతమైన విజయానికి నా హృదయపూర్వక అభినందనలు. ఏడాది క్రితం మా చివరి సమావేశాన్ని గుర్తుచేసుకుని, ఇండియా-ఎన్‌జెడ్ సంబంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం”అని పిఎం మోడీ ట్విట్ చేశారు.