రిలయన్స్ ఖాతా లో చేరనున్నమరో రెండు సంస్థలు

కరోనా నేపథ్యంలో మన దేశంలో ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ పెరిగింది. పాల వంటి నిత్యావసర వస్తువులను సైతం ఆన్ లైన్ ద్వారావినియోగదారులు తెప్పించుకుంటున్ననేపథ్యంలో ఈ రకమైన సంస్థలపై రిలయన్స్ దృష్టి సారించి తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిమగ్నమైoది. ఆన్ లైన్ ఫర్నిచర్ రిటైలర్ అయిన అర్బన్ ల్యాడర్, పాల సరఫరా సంస్థ మిల్క్ బాస్కెట్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. రాయిటర్స్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఇప్పటికే ఈ చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. ఈడీల్ విలువ సుమారు 30 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఏ ఒక్క సంస్థకు చెందిన ప్రతినిధులెవరూ అధికారికంగా స్పందించలేదు.