ఇప్పటంలో ప్రభుత్వం చేసిన కూల్చివేతలను ఖండించిన మోపిదేవి జనసేన

అవనిగడ్డ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రౌడి మూక రాజకీయాలు చేస్తున్న వారి నుండి కాపాడమని మోపిదేవిలో స్వామి వారిని కొబ్బరికాయలు కొట్టి వేడుకోవడం జరిగింది. అనంతరం ఇటీవల ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం చేసిన కూల్చివేతలను ఖండిస్తూ గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ అధ్యక్షతన జరగగా… కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మరియు మోపిదేవి మండల నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.