దళిత మహిళకు అండగా నిలచిన ఎంపీటీసీ విక్రమ్

ఆముదాలవలస నియోజకవర్గం మొదటి వార్డు(బైరి శాస్త్రుల పేట) నందు ఇటీవలే 09-11-2022 తేదీన బండారి. మంజు అనే దళిత మహిళ పై భూ తగదాలో పక్క గ్రామానికి చెందిన గాజుల. కొల్లివలస సర్పంచ్ ముంజేటి. కూర్మరావు అనే వ్యక్తి మరియు కొంతమంది వ్యక్తులు పెద్దమనిషి తరహలో వచ్చి ఆమె పై దాడి చేశారు. ఈ విషయం పై శ్రీకాకుళం జిల్లా డి.ఎస్.పి కూడా కేసు కట్టి దర్యాప్తు కూడా చేసారు. బండారి. మంజు అనే మహిళ ఇంటర్ కాస్ట్ వివాహం వలన ఆమెకు కాస్ట్ సర్టిఫికెట్ కొత్తది ఇవ్వనివ్వకుండా రాజకీయ కుట్ర చేస్తున్నారు. దీనిపై దళితలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని భరోసాతో ఆముదాలవలస నియోజకవర్గం జనసేన ఎంపీటీసీ విక్రమ్ దళిత సంఘాలతో మద్దతు పలికారు. అలానే మన పార్టీ తరుపున కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అలానే కాస్ట్ (కులదృవీకరణ పత్రం) సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలి అని వెంటనే ఎం.ఆర్.ఓ(తహశీల్దార్)కి వినతి పత్రం అందించారు. అతను సానుకూలంగా స్పందించి గురువారం లోపు ఇస్తాం అన్నారు. అంతేకాక ఎంపీటీసీ విక్రమ్ తక్షణమే నిందుతులని ఎక్కడున్నా అరెస్ట్ చేసి తగిన శిక్ష ఇవ్వాలి అని చెప్పి పోలీస్ అధికారులకు కూడా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కసింవలస రాంబాబు నాయకులు, దళిత సోదరులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.