పవనన్న ప్రజాబాట 96వ రోజు

★ దక్షిణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు
★ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్న డాక్టర్ కందుల
★ ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకుంటున్న డాక్టర్ కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 96వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులోనూ ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేరుగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకుంటున్నారు. వారికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా నేరుగా వారి కుటుంబ సభ్యులకు సహాయం చేసి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఏనాడు కూడా గర్వానికి పోకుండా సాటి మనిషికి సహాయం చేయాలని దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకుల సమన్వయంతో కలిసి నియోజకవర్గంలో పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా 32 వ వార్డు భీమ్ నగర్ లో ఉన్న పెళ్లి కుమార్తె నీలిమకు బంగారు తాళిబొట్టు, పట్టుచీర జాకెట్ , పసుపు కుంకుమ అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిహెచ్.శ్రావణి, వి.ఏ నాయుడు, మంగ, దుర్గ, కుమారి, పావని, మంజు, గౌరీ, మణి, రమణ, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.