శ్రీకృష్ణపట్నంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం శ్రీకృష్ణపట్నం గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్న జనసేన కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి స్వయంగా కిట్లను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణపట్నం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.