సీతారామపురంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం సీతారామపురం గ్రామంలో జరిగింది. జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ముందుగా గ్రామంలోని రామాలయంలో గల శ్రీ సీతారాముల వారిని దర్శించి మొదటి కిట్ ను ఆ దేవుని చెంత ఉంచి ఆశీర్వాదం పొంది అనంతరం క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్న జనసేన కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి స్వయంగా కిట్లను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.