ప్రమాద బాధితులను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, గాడాలలో జరిగిన ఆక్సిడెంట్ లో తీవ్ర గాయాలతో రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రావిపాటి వెంకటేశ్వరరావుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు‌ మరియు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి. వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మితో పాటు
సూరపురెడ్డి రాజారావు, గంగిశెట్టి రాజేంద్ర, తిరుమలశెట్టి శ్రీనివాస్, కొత్తపల్లి బుజ్జి, అడ్డాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.