జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొత్త వెలుగుబంద గ్రామానికి చెందిన జనసైనికుడు చెవ్వూరి దుర్గా ప్రసాద్ తల్లి ఇటీవల కాలంలో స్వర్గస్తులు కావడంతో వారికి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి, వారి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి 5,000/- రూపాయలు ఆర్థిక సాయం చేసి, రాబోవు రోజుల్లో జనసేన పార్టీ పక్షాన, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్కపాటి గోపాలం, చాట్ల వెంకటేష్, చాట్ల చిట్టిబాబు, నాతిపాం వీరబాబు, తోట అనిల్ వాసు తదితరులు పాల్గొన్నారు.