భైరిపురంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

చీపురుపల్లి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామంలో క్రియాశీలక జనసైనికులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ జనసైనికులతో

  1. వాళ్ళ గ్రామంలో సమస్యలు,
  2. పార్టీని బలోపేతం ఎలా చేయాలి?
  3. పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజలకి చెప్పడం వంటి అంశాలపై చర్చించడంతో పాటు చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్లు సహాయం చేసిన టీమ్ పిడికిలి పోస్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసారు.