మత్స్యకార గ్రామాల సందర్శన

తూర్పుగోదావరి, మత్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా మత్యకార గ్రామాల సందర్శన కార్యక్రమం మంగళవారం ఉదయం 9గంటలకు ప్రారంభిస్తామని జనసేన పార్టీ అమలాపురం నియోజక ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు తెలిపారు. అమలాపురం నియోజకవర్గం అనాతవరం సెంటర్ నుండి ప్రారంభమై అమలాపురం పట్టణం మీదుగా వై జంక్షన్, అల్లవరం, బెండమూర్లంక సెంటర్, కొమరగిరిపట్నం మీదుగా ఎన్.రామేశ్వరం వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం 11గంటలకు ఎన్.రామేశ్వరం గ్రామంలో మత్యకారులతో సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వీరమహిళలు పాల్గొన వలసినదిగా జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు కోరారు.