చెక్కా దుర్గాప్రసాద్ ను పరమర్శించిన శ్రీమతి మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజవర్గం, యు కొత్తపల్లి మండలం ఉప్పాడ కొత్తపట్నంకు చెందిన జనసేన కార్యకర్త చెక్కా దుర్గాప్రసాద్ రోడ్ మీద ఒక్కడే ఉన్న సమయంలో కత్తుల తోను కర్రలతోను దాడి చేసి మెడ మీద కత్తితో కోయడం, బుర్ర మీద కర్రలతో కొట్టడం వల్ల అక్కడిక్కడే పడిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఇంటికి వెళ్లి ఆ జనసైనికుడు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ప్రసాద్ కి ధైర్యం చెప్పి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తగిన న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, పుణ్యమంతుల మూర్తి, గోపు సురేష్, పంచాయితీ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎనుగంటి హరిబాబు, పంతాడ ప్రసాద్, పట్టా సూరిబాబు, వనమాడి ఎల్లారావు, మచ్చ నాని, సూరిమల్ల అప్పలరాజు, పట్టా భూలోక, పట్టా కోయరాజు, శివకుమార్, ప్రసాద్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.