బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న భాను ప్రకాష్ కి 20,000 ఆర్థిక సహాయం చేసిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, కాసరం హరిజనవాడలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నపుడు 3 సంవత్సరాల వయసున్న తన కుమారుడు భాను ప్రకాష్ బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడని వేలూరు సిఎంసిలో చికిత్స పొందుతున్నాడని కాసరం హరిజనవాడకి చెందిన వి.ప్రభాకర్ వినుతకి తెలపడంతో అప్పటికప్పుడే 20,000 రూపాయలు చెక్కు ద్వారా ఆర్థిక సహాయం చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. సిఎంసిలో హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి డిశ్చార్జ్ ఏర్పాట్లు చేసి , చెన్నై ఎగ్మోర్ హాస్పిటల్ లో ఉచిత చికిత్సకి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ఇంఛార్జి పేట చంద్రశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.