మహాత్ముని ఆశయసాధన కోసం జనసేన తరఫున పోరాడతాం

  • నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్

నంద్యాల: మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా నంద్యాల జనసేన పార్టీ తరఫున రాచమడుగు చందు, సుందర్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాచమడుగు సుందర్ మాట్లాడుతూ మహాత్ముని ఆశయసాధన కోసం నంద్యాల జనసేన పార్టీ తరఫున పోరాడతామని సత్యం అహింస మార్గంలో నడుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన సాయి, సంజీవరాయుడు, ఫకృద్దీన్, సుంకన్న, సురేంద్ర, బాల మద్దిలేటి, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.