సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చిన శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి పట్టణం లో జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన సందర్భంలో పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలను మున్సిపల్ కమిషనర్ ని పట్టణ నాయకులతో కలిసి వెళ్ళి వినతి పత్రం అందజేసి.. త్వరిత గతిన ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు భవాని శంకర్, నాయకులు మణికంఠ, షేక్ మున్న, షేక్ కరీం, షేక్ రఫీ, తేజా, సురేష్, నగేష్, శేఖర్ రెడ్డి, చందు, తదితరులు పాల్గొన్నారు.