ఎన్నికల ప్రచారంలో ముమ్మారెడ్డి కుటుంబం

తెలంగాణ, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భగత్ సింగ్ నగర్ ఫేస్ వన్ లో బిజెపి బలపరిచిన కూకట్పల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తరపున ప్రేమ కుమార్ సతీమణి, కుమార్తె, జనసేన-బిజెపి కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతి ఒకొక్క ఫ్లాట్ సందర్శించి(సుమారుగా 500 ఫ్లాట్స్) జనసేన అభ్యర్థికి ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.