సామాజిక న్యాయ చైతన్య యాత్రలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటీలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నేతృత్వంలో 20వ డివిజన్ నాయకులు బస్వాని నాగబాబు ఆధ్వర్యంలో సామాజిక న్యాయ చైతన్య యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలతో ముచ్చటించడం జరిగింది. ప్రజలతో మాట్లాడుతూ సమాజం అంతే అనేక వర్గాల సముదాయమనీ, వీటి మధ్య సమతుల్యం పాటించేలా ప్రభుత్వాల పాలన ఉండాలనీ అప్పుడే ప్రజల మధ్య అసమానతలు తొలగిపోయి సమసమాజం ఏర్పడుతుందన్నారు. కానీ నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం అణగారిన వర్గాలను మరింతగా అణచివేస్తూ, ఒకరి మీదకు మరొకరిని ఉసిగొలుపుతూ తన పబ్బాన్ని గడుపుకుంటోందని విమర్శించారు, దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజలు ఈ ధోరణిని గమనించాలని చైతన్య పరుస్తూ తాము ఈ యాత్ర చేపట్టామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, వీరబాబు, ధర్మేంద్ర, నందకుమార్, సతీష్, నీలాద్రి, సంతోష్, దుర్గాప్రసాద్ (జాక్) మరియు జనసైనికులు పాల్గొన్నారు.