ఉగాది వేడుకలలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటి: ఉగాది పండుగ సందర్భంగా బుధవారం కాకినాడ సిటిలో వివిధ ప్రాంతాలైన జగన్నాధపురంలోని రంగా మిత్రమండలి దుర్గా శివకుమార్ ఆధ్వర్యంలోను, మెహర్ నగర్ శారదా దేవి గుడి వద్ద రావిపాటి వేంకటేశ్వరరావు దంపతులు, డోలంకి మురళీక్రిష్ణ దంపతులచే ఏర్పాటు చేయబడిన పంచాంగ శ్రవణ కార్యక్రమాలలో స్థానికులు భక్తిభావనతో పూజలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ వారితో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ తమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి శుభాకాంక్షలను వారికి అందచేస్తూ, ఈ శోభకృత్ తెలుగు సంవత్సరాది ప్రజలకు అన్నీ శుభాలు జరుగుతూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని కోరుకున్నారు. తెలుగువారి సాంప్రదాయాలు, పద్ధతులు పాటిస్తూ భావితరాలకు అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ సిటి అధ్యక్షుడు సంగిసెట్టి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటి ట్రెజరర్ & మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరి మడ్డు విజయ్, సురేష్ నాయుడు, శ్రీనివాస నాయుడు, పట్నాల రాజారావు, గంగాధర్, సతీష్, గోపి, నాని, వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రాజేష్, వరదా దొరబాబు, అర్జున్ రాజు, ఏసేబు, బట్టు లీల, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు.