కాకినాడ రేచర్ల పేటలో ముత్తా శశిధర్ పర్యటన

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ మంగళవారం కాకినాడ రేచర్ల పేట ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలతో ముచ్చటిస్తూ వారి బాగోగులు, సమస్యలను తెలుసుకోడం జరిగింది. ఈ పర్యటనలో వారు ఆ ప్రాంతంలో కొత్తగా కట్టిన ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి శిల్పాన్ని మలచిన శిల్పులని సత్కరించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. ఈ వై.సి.పి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, సాక్ష్యాత్తూ తిరుమల తిరుపతి దేవస్థాన కార్య నిర్వాహణని వ్యాపార సంస్థగా చేస్తోందని, చర్చుల్లో పాస్టర్లకు భత్యాన్ని ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ పేరుకు కొంతమందికి అందిస్తోందని, ఇక ముస్లిం ఇమాంలకు కూడా సహాయాలను, పధకాలను నిర్లక్ష్యం చేస్తూ కిందనున్న ప్రజలనే కాకుండా.. పైన ఉన్న ఆ భగవంతుడిని కూడా నిలువునా మోసం చేస్తోందని విమర్శించారు. కానీ జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదనీ ఈ వై.సి.పి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక పాలనని ప్రశ్నించి ఎండగట్టడంలో ఎలాంటి సంకోచం లేదని అన్నారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని హర్షించే రీతిలో మసలుకుని ప్రభుత్వాన్ని నడపలేని ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజు త్వరలోనే ఉందని ఎద్దేవా చేసారు.