జనసేన పార్టీ బలోపేతమే నా లక్ష్యం: యల్లటూరు శ్రీనివాసరాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండల పరిధిలో పాటూరు, నాగిరెడ్డి పల్లె పంచాయతీల పరిధిలో గల ఎగువ కుమ్మరపల్లె, దిగువ కుమ్మర పల్లె, రాచపల్లె, ఇసుక పల్లి, హరిజన వాడలలో పర్యటించి రాబోవు ఎన్నికలలో జనసేన పార్టీ టిడిపి కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతమే నా లక్ష్యమని, పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ అభివృద్ధే నా లక్ష్యం అని అన్నారు. ఈ నెల 29 వ తేదీన నందలూరు మండలంలో అంగరంగ వైభవంగా జనసేన పార్టీ మండల కార్యాలయం ప్రారంభించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, షబ్బీర్ అహ్మద్, జనసేన నాయకులు ఆకుల చలపతి, సుబ్బరాజు, శ్రీనివాసరాజు, శంకర్ రాజు, గూడూరు శంకరయ్య, అమృత కవి తిరుపాల్, రాజయ్య, సమ్మెట ఉమా మహేష్, కల్లూరి సుబ్బారాయుడు, ఆకుల వెంకటేష్, జాకిటి రమణ, కృష్ణయ్య, బాబు, మారయ్య, వేణుగోపాల్, గంగయ్య, బొమ్మవరం, శీను, వార్డు మెంబర్ పులి నరసింహ, పొగడతొట్టి మణికంఠ, కప్పల నితీష్, యాగల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.