బొలిశెట్టికి మద్దతుగా రవణం స్వామినాయుడు ప్రచారం

తాడేపల్లిగూడెం: త్వరలో జరగబోయే ఎన్నికలలో జనసేన పోటీ చేసే 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు మరియు కూటమి అభ్యర్థులు అందరూ విజయం సాధించాలని కోరుతూ అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ శనివారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తనయులు బొలిశెట్టి రాజేష్, అఖిలభారత్ చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కటకం రామకృష్ణ, రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి ఉండవల్లి రమేష్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి గోపి కృష్ణ, తులా రామలింగేశ్వర రావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోపల్లి శ్రీనివాస్, వలవల తాతాజీ, శానం రామకృష్ణ, మెగా అభిమానులు పాల్గొన్నారు.