పెద్దమడి గ్రామంలో ‘నా సేన నాకోసం నా వంతు’

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం పెద్దమడి గ్రామంలో ‘నా సేన నాకోసం నా వంతు’ కార్యక్రమంలో పెద్దలను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై పెద్దమడి గ్రామంలో వైసీపీ నుండి టిడిపి నుండి సుమారు 20 మంది జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు మేడిశెట్టి వెంకటేశ్వరరావు, పాటి కృష్ణమూర్తి మరియు కొంతమంది జాయిన్ అయ్యారు. మురమళ్ళ నుండి ఐ పోలవరం వెళ్లే రోడ్డు బాణాపురం దగ్గరలో పూర్తిగా జలమయమై ఉన్నది ప్రజలందరూ కూడా రోడ్డు మీద వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ఈ రోడ్డుని ముఖ్యమంత్రికి చూపించడం జరిగింది. సిసి రోడ్ వేసేస్తున్నాం అని చెప్పేసి చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏ విధమైన చర్యలు చేపట్టలేదు ప్రజలు కష్టాలు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందించటం అనేది ఆయనకు అలవాటుగా మారింది ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని. వెంటనే ఆ రోడ్డును నిర్మించి అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలని కాపాడాలని తక్షణం రోడ్డు నిర్మించాలని జనసేన పార్టీ తరఫున పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు. వీరు వెంట మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషత్తు సంయుక్త కార్యదర్శి తాళ్లూరు, ప్రసాద్ దేవ్ రాంబాబు, రాపిరెడ్డి బాబి, మల్లిపూడి రాజా, లంకెలపల్లి జమ్మి, కర్రి శేఖర్, సవరపు వెంకట, గంజా యేసు, దూడల స్వామి, పోలిశెట్టి కుమార్, నరహారశెట్టి రాంబాబు, పాటి శీను, పాటి హరికృష్ణ, కర్ణిడి మూర్తి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.