ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా: శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఆరోగ్యం సరిలేదని తెలుసుకున్న నందిగామ నియోజకవర్గం తుర్లపాడు గ్రామంకి చెందిన టీడీపి నాయకులు దాసరి యేసుప్రభు మరియు జనసేన మండల ఉపాధ్యక్షులు పురంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు జనసైనికులు రమాదేవి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి ఏసుప్రభు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గంలో తంబళ్ళపల్లి రమాదేవి జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి వినూత్నమైన కార్యక్రమాలతో ఆమెకంటూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని, జనసేన పార్టీ కేడర్ బలోపేతానికి ఆమె రాత్రి, పగలు అలుపెరగకుండా శ్రమించి జనసైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపి జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలోని జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళల యొక్క సహకారంతో మరియు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశానని తెలియజేశారు. తిరిగి పూర్తి ఆరోగ్యంతో త్వరలో ఎన్నికల సమయానికి ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం నా పూర్తి సహాయ సహకారాలను అందించి విజయం కోసం కృషి చేస్తానని రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ టిడిపి జనసేన నాయకులు మరియు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.