కుప్పంలో ‘నా సేన కోసం నా వంతు’

కుప్పం నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ‌ సాధనలో భాగంగా, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డా. మద్దినేని వెంకటరమణ పర్యవేక్షణలో శనివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శాంతిపురం పరిసర ప్రాంతాలలో నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గం జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి వేణు, నియోజకవర్గ సమన్వయకర్త అరుణ్, మండల కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్, హరి, సంపత్, ఎ చంద్రశేఖర్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.