పులిగడ్డ గ్రామంలో నా సేన కోసం నా వంతు

కృష్ణాజిల్లా, జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు(కెకె) ఆదేశానుసారం, రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి ఆర్గానిక్ ప్రసాద్, సూచనలు మేరకు నా సేన కోసం నా వంతు కార్యక్రమం కృష్ణాజిల్లా వ్యాప్తంగా వారోత్సవాలుగా జరుగుతున్నటువంటి తరుణంలో శుక్రవారం పులిగడ్డ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ ప్రధాన కార్యదర్శి మండలిదయాకర్ ఇంటి ప్రాంగణంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జనసేన నాయకులు చిలకలపూడి పాపారావు, విక్కుర్తి రాంబాబు, జనసేన పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ కో-కన్వీనర్ కొప్పిరెడ్డి సూర్యనారాయణ మూర్తి, బండ్రెడ్డి మల్లిఖార్జున్, ప్రోగ్రాం కమిటీ రాజా, అంకాని మహేంద్ర, జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, కోడూరు మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ,, దామెర్ల నారాయణ, అర్జా కాంత్ కిరణ్, పసుపులేటి రవి, బాదర్ల లోలాక్షుడు, వడ్లమూడి రామకృష్ణ, కొక్కిలిగడ్డ లంకేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.