యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో ‘నా సేన కోసం నా వంతు’

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి
  • సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జనసేన రావాలి
  • రాజకీయాల్లో జన భాగస్వామ్యం పెరగాలి:
  • అప్పుడే జనరంజక పాలన సాధ్యమవుతుంది:
  • ప్రజాదరణ నేత పవన్ కళ్యాణ్ ను ఆదరించండి:
  • పార్టీకి అండగా నిలబడాలని మండల ప్రజలు కోరిన జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లిలో ‘నా సేన కోసం నా వంతు’ ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఉద్భోదించారు. నియోజకవర్గంలో కూడా జనసేన జెండా ఎగర వేస్తుందని తెలిపారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జనసేన రావాలని కోరారు. రాజకీయాల్లో జన భాగస్వామ్యం పెరగాలని, దీనికోసం జనసేన పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు, జనసేన పార్టీకి అండగా మీ వంతు సహకారం, ప్రోత్సాహం పది రూపాయల నుండి ఎంతైనా జనసేన పార్టీ 7288040505, 7288040505@ఉపి నంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ద్వారా పంపించవచ్చని, అప్పుడే జనరంజక పాలన, పారదర్శకమైన పాలన, జవాబుదారీతనంతో కూడిన పాలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాదరణ కలిగిన నేత పవన్ కళ్యాణ్ ను ఆదరించండని, పార్టీకి అండగా నిలబడాలని మండల ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.