దేవి నవరాత్రుల వేడుకలో అనుశ్రీ

రాజమండ్రి సిటీ, స్థానిక 29 వార్డు కొత్తపేటలో శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా రాజమండ్రి సిటీ కార్పొరేషన్ కార్యదర్శి సురేష్ నాయుడు ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరవడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులైన కిలారి శ్రీను మర్యాదలతో సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆలయ అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం దుర్గమ్మ మండపాన్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.