అమరజీవికి నివాళి అర్పించిన మైలవరం జనసేన

మైలవరం: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నూజివీడు రోడ్ లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణకు కారణమైన కారణజన్ముడు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని, అటువంటి త్యాగదనుల జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని, అప్పుడే ప్రశ్నించే తత్వం పెరుగుతుందని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులను, పొట్టి శ్రీరాములు లాంటి త్యాగధనులను కేవలం పేర్లకే పరిమితం కాకుండా వారి ఆశయాలను నేటి రాజకీయ నాయకులు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. జనసేన పార్టీ అధికారం చేపట్టిన వెంటనే సంక్షేమ పథకాలకు త్యాగదనుల, స్వాతంత్ర సమరయోధులు పేర్లను పెట్టడమే కాకుండా వారి ఆశయ సాధనకు పాటుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు ఆనం విజయ్ కుమార్, చిట్టిమాద వెంకటకృష్ణ, జనసైనికులు తోట మాధవరావు, గుర్రం వెంకటేశ్వరరావు, పుచ్చకాయల తిరుపతిరావు, కస్తాల రవికుమార్, కస్తాల పూర్ణచంద్రరావు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.