కొత్తపల్లిలో క్రీయాశీల సభ్యుని కుటుంబానికి 5లక్షలు అందించిన నాదెండ్ల

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి నాదెండ్ల మనోహర్ రావడంతో నియోజకవర్గం ప్రజలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తొలుత కొత్తపల్లి సెంటర్ నందు వీరమహిళలు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు. భారీ జనసంద్రంతో డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త దాకారపు కొండలు ఇంటికి చేరుకొని అయన కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల(5,00,000/-) చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థికసాయం అందలేదని తాము నిరుపేద కుటుంబం ముగ్గురు ఆడపిల్లలతో కుటుంబాన్ని సాగించే వాళ్ళము నా భర్త చనిపోయాక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నామని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో జనసేన పార్టీ తోడుగా ఉండడం జనసేన పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని దీనికి సహకరించిన కొత్తపల్లి జనసైనికులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు భారీగా జనసైనికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.