నాదెండ్ల మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ & కార్మిక నాయకులు దుగ్గన బాబ్జీల ఆధ్వర్యంలో జగన్నాధపురం విష్ణాలయం ప్రాంతంలోను మరియు 41వ డివిజన్ వాసిరెడ్డి సత్య కుమార్ ఆధ్వర్యంలోను జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంత ప్రజలకు నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాల చిట్టాని విశదీకరించారు. గర్భిణీలకు ఇచ్చే పాల నుండీ స్కూలు పిల్లలకు ఇస్తున్న స్కూలు బ్యాగులు, షూల వరకూ సమస్తం చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమ మార్గంలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఆమ్యామ్యాల ప్రభుత్వం అని ప్రజలు పిలుచుకుంటున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఎంతటి ఘనమైనది అనంటే అనారోగ్యంతో ప్రజలు బాధపడుతూ సహాయం పొందే ఆరోగ్య రక్ష పధకం నుండీ కూడా చేయని బిల్లులకు డబ్బులు నొల్లేస్తూ ప్రభుత్వ ఖజానాని ఖాళీచేస్తున్నారనీ అదికూడా అరికట్టని అక్రమాల చక్రవర్తి అన్నారు. కానీ ఉచిత ఇసుక ప్రజలకు ఇచ్చాడని గతప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రభుత్వానికి నష్టం చేసారని కేసులు పెడతారనీ ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నవ్విపోదురుగానీ నాకేటి సిగ్గు అన్న చందాన ప్రవర్తిస్తున్నాడని అనుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనువాస్, బడ్డి శివ, పాల్ రాజ్, గరగా శ్రీను, సతీష్, నగేష్, సంతోష్, దారకేష్, పురుషోత్తం, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.