ఈలి మణికంఠ నాయుడు కుటుంబానికి 5లక్షల చెక్కు అందజేసిన నాదెండ్ల

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, పెనుమల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు ఈలి మణికంఠ నాయుడు ప్రమాదవశాత్తు మరణించారు. వారి కుటుంబానికి కాకినాడ ముత్తా క్లబ్ నందు 5 లక్షలరూపాయల చెక్కును అందచేసిన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.