మిస్టర్ & మిసెస్ స్టార్ ఈవెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేసిన నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు:  వి ఈవెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన మిస్టర్ అండ్ మిసెస్ స్టార్ ఈవెంట్ లో 35 మంది సబ్యులు పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్ లో ఐదుగురు సెలెక్ట్ అయ్యి బెస్ట్ విన్నర్స్ గా గెలుపొందారు. సోమవారం గోవాలో జరగబోయే ఈ కాంపిటీషన్స్ ఫైనల్స్ లో కూడా ఈ ఐదుగురు పాల్గొంటారు. ఈ ఐదుగురు విజేతలకు జనసేన తరఫున నలిశెట్టి శ్రీధర్ బహుమతి ప్రధానం చేసారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతి ప్రధానం చెయ్యడం ఆనందంగా ఉందని తెలియజేసారు.